హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగరంలో గత సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గచ్చిబౌలిలోని వట్టినాగుల పల్లిలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారికి వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి

