నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి ముఠా దాడిలో గాయపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుల కారును ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోగా కడుపులో తీవ్రగాయాలయ్యాయి. అధికారులు హుటాహుటిన ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గాయమైన కిడ్నీని తొలగించారు.

