
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్డు, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, సచివాలయం మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.