
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో (MI) జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్స్కు చేరాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. పంజాబ్ జట్టులో ఈ మ్యాచ్లో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ జట్టులోకి వచ్చాడు. ముంబై కూడా జట్టులో ఒక మార్పు చేసింది. గ్లీసన్ స్థానంలో టాప్లేని జట్టులోకి తీసుకుంది.