
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని జంగలపాడు రాజయోగి క్వారీలో విషాద ఘటన జరిగింది. ఆకస్మికంగా పిడుగు పడటంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు కలిగాయి. రాజయోగి క్వారీలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న వలస కూలీలు. పిడుగు పడే సమయంలో కూలీలు బహిరంగ ప్రదేశంలో పనిచేస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.