
‘పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత కావాలి. స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చెట్లను పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? పర్యావరణాన్ని కాపాడటంలో దేశానికే ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.