
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో శనివారంనాడు మధ్యాహ్నం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.’ది సన్ క్లాసెస్ లైబ్రరీ’ కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్లో పేలుడు సంభవించింది. పేలుడులో పలువురు పిల్లలు గాయపడ్డారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.