హైదరాబాద్ ఐటీ హబ్ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, విలాసవంతమైన హంగులతో రూపుదిద్దుకున్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత హాస్యనటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ మల్టీప్లెక్స్లో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ అట్మోస్ స్క్రీన్ను ఏర్పాటు చేయడం విశేషం.

