
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులను విచారించింది. వీరంతా సీఎం సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని తెలపడంతో కేసీఆర్కు జూన్ 5న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు, జూన్ ఐదో తేదీకి బదులు 11న విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది. కేసీఆర్ ఈనెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు.