కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. ప్రముఖ లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వచ్చినప్పుడు కూడా ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.

