
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు.