
కాంగ్రెస్ దర్శకత్వంలో BRS కొత్త సినిమా మొదలైయ్యిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అన్నారు సంజయ్. ఇందులో కేసీఆర్ ను జోకర్ గా మార్చారని, కవిత ఎపిసోడ్ తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతోందా? మీడియా కూడా ఆలోచించాలన్నారు.