కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇవాళ(శుక్రవారం) బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యారని కావేరి బస్సు యాజమాన్యం, డ్రైవర్ ముత్యాల లక్ష్మయ్యలపై 125/Aతో పాటు మరికొన్నిసెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆ బస్సుకి చెందిన ఒక డ్రైవర్ శివ నారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

