వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామంలో సోమవారం ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు (45) అనే వ్యక్తిపై రుద్రారం బాలు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నిందితుడు సాయిలు మెడపై బలంగా నరకడంతో, అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలే జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

