అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లోనూ రాణించింది. తాజా ఫలితం తర్వాత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో ఉన్న ఢిల్లీ, +1.170 నికర రన్ రేట్తో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (+0.637) రెండో స్థానానికి పడిపోయింది. పంజాబ్ 4 పాయింట్లు కలిగి ఉన్న, రన్ రేట్ పరంగా ఢిల్లీ కంటే వెనుకబడి ఉంది.

