
ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం మరో కొత్త ప్రథకాన్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ‘బాల భరోసా’ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోనుంది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఈ పథకం వివరాలను వెల్లడించారు. పథకం కింద ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.