వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు పారదర్శకంగా, అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకు ప్రవేశ పెట్టిన యూరియా యాప్ ఐదు జిల్లాల్లో సుమారు లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 19,695 మంది రైతులు ఈ యాప్ ద్వారా తమ సమీప డీలర్ దగ్గర 60,510 యూరియా బస్తాలు బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

