
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ రెండో విడత పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) విడుదల చేసింది. ఏప్రిల్ 2,3,4,7,8 తేదీలలో పేపర్ 1 పరీక్షలు, ఏప్రిల్ 9న పేపర్ 2ఎ, 2బి పరీక్షలు జరుగనున్నట్లు వెల్లడించింది. జెఇఇ మెయిన్ పరీక్షలను ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్ష పూర్తి చేసి ఫలితాలను వెల్లడించగా, తాజాగా రెండో సెషన్ పరీక్ష నిర్వహణకు ఎన్టిఎ ఏర్పాట్లు చేస్తోంది.