
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఉత్తర్వులు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే బదిలీల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.