
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల పేర్లు, సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఏడుగురు మంత్రులతో ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్థనల నేపథ్యంలో తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.