
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. జూన్ 10న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు. అందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 10వ తేది ఉ.11.30 గం.లకు విశాఖపట్నం చేరుకుని మధ్యాహ్నం 3 గం.ల వరకూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ
కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 3.20 గం.లకు జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళతారు.