ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్య పడకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది.. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని కేటీఆర్ గుర్తుచేశారు.

