ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా చేసినట్లు సమాచారం. తదుపరి సీఈవోను నియమించేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు పలు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ లైన్ కార్యకలాపాల్లో అంతరాయాలు, పెరిగిన ఖర్చులు, ఈ ఏడాది రికార్డు స్థాయిలో నష్టాల నేపథ్యంలో ఇది చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతవారమే విల్సన్ రాజీనామాను బోర్డు సమావేశంలో ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

