
కూటమి ప్రభుత్వం వైఫల్యం దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు.