ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఆర్సీబీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80) భారీ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) రాణించడంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయగలిగింది.

