బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో ఆదివారం ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. 20 రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సుపరిపాలన, అనుసరించాల్సిన అత్యుత్తమ పద్ధతులపై సమాలోచనలు. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోడీ, రక్షణ బలగాలను అభినందిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.

