ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై ఈ క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్ నతాంజై దాడుల ప్రతీకారంగానే తాజాగా టెహ్రాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

