గవర్నమెంట్ ఆఫీసుల్లో కొండల్లా ఏళ్ల తరబడి మూలుగుతున్న ఫైళ్లకు క్లియరెన్స్ దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ-ఆఫీస్లోనే ప్రభుత్వ సేవలు అమలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని శాఖల అధికారులకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఆర్థిక శాఖ కూడా ఈ-ఫైల్ విధానంలోని ఫైళ్లను మాత్రమే పరిశీలిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ కాపీలను పరిగణించబోమని తాజాగా ప్రత్యేకంగా సర్క్యులర్ కూడా జారీ చేసింది.

