టి20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

