ముంబై పొవైలోని ఆర్ఏ స్టూడియోలో యాక్టింగ్ ఆడిషన్ కోసం వచ్చిన 17 మంది పిల్లలు (13-17 సంవత్సరాలు), ఇద్దరు పెద్దవాళ్లను బందీలుగా ఉంచుకున్న ఫిల్మ్మేకర్, యూట్యూబ్ నడిపే రోహిత్ ఆర్యా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పోవై పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్ స్టూడియోలోకి దూకి, అందరినీ సురక్షితంగా రక్షించారు. మొత్తం 19 మంది బందీలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అడ్డుకోబోయిన రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది

