రాహుల్ గాంధీ మిస్సింగ్’ అనే పోస్టర్తో కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు. చివరిసారిగా 59 రోజుల క్రితం బిహార్లో రాహుల్గాంధీ కనిపించారని, ఆ పోస్టర్లో ప్రస్తావించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్పై రాహుల్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, తద్వారా విపక్ష మహాగఠ్బంధన్ కూటమిలో కాంగ్రెస్ స్థాయిని తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా ఒక యానిమేటెడ్ పోస్టర్ను అప్లోడ్ చేశారు.

