
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ వ్యవస్థలో మరో ముందడుగుకు శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే రెవెన్యూ అధికారులు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 3 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించేదిశగా అడుగులు వేయనుంది. రెవెన్యూ సదస్సులపై సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించారు.