
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షానికి ఆయుధమైంది. CDS వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్పై ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఈ ఆపరేషన్పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలని.. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాస్తవాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.