
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి “బిజెపి-ఆర్ఎస్ఎస్ నాయకులపై కొంచెం ఒత్తిడి తెచ్చినా, వారు భయపడి పారిపోతారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుండి ఫోన్ చేసి.. నరేందర్.. లొంగిపోండి అని అన్నారు. ఇక్కడ, నరేంద్ర మోడీ ‘ఎస్ సార్’ అని యుద్ధం విరమించుకున్నారు” అని రాహుల్ అన్నారు.