
గోవాకు గవర్నర్ గా నియమితులైన తర్వాత అశోక్ గజపతి రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించిన కూడా సమర్ఱవంతంగా నిర్వహించుకుంటూ వచ్చానన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తనను గవర్నర్ గా సిఫారసు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహంలేదని, ఏనాడు అవకాశాలు కావాలని పరుగెత్తలేదన్నారు. తనకు ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వర్తించి.. తానేంటో నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చారు.