ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. ఈ కాంబోలో సినిమాను కన్ఫార్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లింప్స్ను మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇది ‘#AA23’ వర్కింగ్ టైటిల్తో షురూ కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

