అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది తీరంలోని జమ్తారా ఘాట్ వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. యజ్ఞం ముగిసిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు, గడ్డితో నిర్మించిన మండపం క్షణాల్లో కాలి బూడిదయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

