రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని భూమిలేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వారికి ఇచ్చే పెన్షన్ ను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మిస్తున్న గ్రామాల్లోని 1575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు పెన్షన్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు.

