అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)–2025 కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 23 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు రూ.10,000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

