అహ్మదాబాద్లో కుప్పకూలిన విమానంవల్ల వందల మంది చనిపోయారు. ఇప్పుడు ఆ విమానంలో లోపాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. లండన్ కు బయలుదేరే ముందు ఆ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. అలా వచ్చినప్పుడు ఓ ప్రయాణికుడు విమానంలో లోపాలపై ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.