
నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరగుతున్నాను. నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను. నన్ను బంధించి ఉంచడం కానీ మానసికంగా
హింసించడం కానీ ఎవ్వరి తరం కాదు’అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు.గతంలో నా భార్య విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచిపోయారా? అంటూ కుమార్తె క్రాంతిని ఉద్దేశిస్తూ ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు.