వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.మృతదేహాలను తరలించే అంబులెన్స్ వాహనాలు లేక, మృతదేహాన్ని ఆటోలో తరలించారు. చౌటుపల్లి గ్రామానికి చెందిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని చౌటుపల్లి గ్రామానికి తరలించాల్సి ఉంది. అయితే అంబులెన్సులు లేకపోవడంతో చేసేదేమి లేక మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆటోలో తరలించారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఎంజీఎంలో సౌకర్యాల పరిస్థితిని అద్దం పట్టేలా ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

