
అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, 44.1 ఓవర్లలో162 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. సిరాజ్కి తోడు జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది..