శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతానికి సమీపంలో చిరుత ప్రవేశించింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గూడెంలో బుధవారం అర్ధరాత్రి ఆరుబయట తల్లి పక్కన నిద్రలో ఉన్న 3 ఏళ్ల చిన్నారిని నోటకరచుకుని ఈడ్చుకెళ్లింది. తండ్రి అంజయ్య.. ప్రాణాలకు తెగించి చిరుత వెంట పరుగులు పెట్టాడు. అంజయ్య అరుపులకు ఆ చిన్నారిని చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ చిన్నారికి తల, మెడ భాగంలో తీవ్ర గాయాలు కాగా..
ఆస్పత్రిలో చికిత్స అందించడంతో.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి.

