ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

