పార్లమెంటులో 10 గంటల పాటు వందేమాతరం గేయంపై చర్చ జరగడంపై బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ విమర్శలు గుప్పించారు. నిన్న వందేమాతరం దేశభక్తి గేయంపై పార్లమెంటులో 10 గంటల పాటు చర్చ జరిగింది. జనాలకు ఇది బాగా నచ్చింది. ఈ చర్చ కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైపోయింది. ఇండిగో, వాయు కాలుష్య సమస్యలు కూడా తొలగిపోయాయి. పార్లమెంటు కోసం నిమిషానికి రూ.2.5 లక్షల చొప్పున 600 నిమిషాల పాటు చర్చకు ఎంత ఖర్చయ్యిందో జనాలు లెక్కలు వేసుకోవాలని అన్నారు.

