రోహిణి ఆచార్య సంచలన ప్రకటన నేపథ్యంలో ఆమెను ప్రభావితం చేసిన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు? అన్నది చర్చనీయాంశమైంది. సంజయ్ యాదవ్ ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ. లాలూ కుమారుడు, ఆ పార్టీ వారసుడు తేజస్వి యాదవ్కు అత్యంత విశ్వసనీయ అనుచరుడు. ఉత్తరప్రదేశ్లోని రాజకీయ కుటుంబానికి చెందిన తేజస్వి యాదవ్ పాత స్నేహితుడు రమీజ్. అయితే వీరిద్దరూ రోహిణి ఆచార్యకు ఏమి చెప్పారు అన్నది ఆమె పోస్ట్లో స్పష్టత లేదు.

