
అమరావతి రాజధాని మరోసారి రాజకీయ చర్చలకు వేదిక కానుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి.సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర కీలక అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.