
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆనందాలు రెట్టింపు అయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఆయన సతీమణి ఉపాసన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. తాము రెండోసారి తల్లిదండ్రులు కానున్నట్లు ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.
ఈ శుభవార్తను ఉపాసన స్వయంగా దీపావళి సందర్భంగా షేర్ చేసుకున్నారు. “ఈ దీపావళికి మా జీవితాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. ప్రేమ, ఆశీర్వాదాలు, ఆనందాలు అన్ని రెట్టింపుగా వచ్చాయి” అంటూ ఆమె ఎమోషనల్ నోట్ రాశారు.