
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. 2025 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 44 మంది ఎంపికవగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు మారం పవిత్ర. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు.